గవర్నర్ ను కలిసిన ఎమ్మెల్యే రాజాసింగ్ భార్య

, raja singh wife meets telangana governor

ఎమ్మెల్యే రాజాసింగ్ భార్య ఉషా బాయి ఆదివారం రాజ్ భవన్ లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిశారు. తన భర్త రాజాసింగ్ పై అక్రమంగా పీడీయాక్ట్ బనాయించారని గవర్నర్ కు చెప్పుకొని బాధపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ వర్గాన్ని సంతృప్తి పరిచేలా వ్యవహరిస్తుండడంతో, తన భర్త దాన్ని వ్యతిరేకించారని, దాంతో తన భర్తపై అక్రమ కేసులు నమోదు చేశారని ఉషా బాయి ఆరోపించారు. పోలీసులు చెబుతున్న 100కి పైగా కేసులన్నీ మోటివేటెడ్ కేసులేనని వివరించారు. ఆ కేసులు ప్రజాప్రతినిధుల కోర్టులో కొట్టేసినవేనని ఉషా బాయి స్పష్టం చేశారు. పోలీసులు పెట్టిన అక్రమ కేసులపై జోక్యం చేసుకోవాలంటూ ఆమె గవర్నర్ ను కోరారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.

ఇక మత విశ్వాసాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే మొదటిసారిగా ఓ ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ నమోదు చేయడం రాజాసింగ్ విషయంలోనే జరిగింది. ఆయనను కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ప్రస్తుతం రాజాసింగ్ చర్లపల్లి జైలులో ఉన్నారు.