రాజశేఖర్ కూతురి తో రాజ్ తరుణ్ ‘ఆహ నా పెళ్ళంట’

యంగ్ హీరో రాజ్ తరుణ్ హిట్ కొట్టి ఎన్ని ఏళ్లు అయ్యిందో..ఉయ్యాలా జంపాల మూవీ తో ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి మూవీ తోనే భారీ హిట్ అందుకున్న రాజ్ తరుణ్..ఆ తర్వాత కుమారి 21 ఎఫ్ , సినిమా చూపిస్తా మావ , ఈడోరకం ఆడోరకం వంటి వరుస హిట్లతో స్టార్ హీరో అయ్యాడు. కానీ ఆ తర్వాత కథల ఎంపిక లో తరుణ్ రాంగ్ స్టెప్స్ వేస్తూ వరుస ప్లాప్స్ అందుకుంటున్నాడు. రాజ్ తరుణ్ నుండి ఎప్పుడు ఏ సినిమా వచ్చిందో కూడా తెలియని విధంగా అయిపొయింది. రీసెంట్ గా స్టాండప్ రాహుల్ మూవీ తో మార్చి 18 న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అసలు ఈ సినిమా విడుదలైన సంగతి కూడా ఎవరికీ తెలియకుండా అయిపొయింది. దీంతో ఈ సినిమా కూడా ప్లాప్ జాబితాలో చేరింది.

ఈ తరుణంలో రాజ్ తరుణ్ కు వెబ్ మూవీ లో నటించే ఛాన్స్ వచ్చింది. తమడ మీడియా మరియు జీ5 సంయుక్తంగా నిర్మించబోయే వెబ్ సీరీస్ లో రాజ్ తరుణ్ హీరోగా నటించబోతున్నాడు. ఆహ నా పెళ్ళంట టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సిరీస్ కు సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించబోతుండగా.. రాహుల్ తమడ సాయిదీప్ రెడ్డి బుర్ర నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ఈ సిరీస్లో రాజ్ తరుణ్ సరసన శివాని రాజశేఖర్ హీరోయిన్ గా నటించబోతోంది. వీరిద్దరి లవ్ ట్రాక్ హైలైట్గా నిలుస్తుందని టాక్ నడుస్తోంది. అలాగే ఈ మూవీ లో ఆమని, హర్షవర్ధన్, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్నారు. మరి ఈ వెబ్ సిరీస్ అయినా రాజ్ తరుణ్ కు హిట్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.