కేంద్రమంత్రికి ధన్యవాదాలు తెలిపిన ఆర్ఆర్ఆర్ టీం

రాజమౌళి డైరెక్షన్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా పాన్ ఇండియా మూవీ గా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఆర్ఆర్ఆర్. వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో విడుదలై సూపర్ హిట్ సొంతం చేసుకొని కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ మూవీ రెండో వారంలోను హౌస్ ఫుల్ కలెక్షన్లతో రాణిస్తుంది. ఈ తరుణంలో ఈ సినిమా కలెక్షన్ల గురించి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పందించడం సినిమాకు మరింత బజ్ తీసుకొచ్చింది.

పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమానే నడుస్తుంది దేశమంతా. ఇది చాలా పెద్ద సినిమా, ఇప్పటికే 750 కోట్ల కలెక్షన్లని రాబట్టి రికార్డులని సృష్టిస్తుందని విన్నాను. ‘ఆర్ఆర్ఆర్’ లాగే భారత ఆర్ధిక వ్యవస్థ కూడా రికార్డులని బద్దలు కొట్టే బిజీలో ఉంది అని అన్నారు. సినిమా పట్ల పీయూష్ గోయల్ స్పందించడం పట్ల చిత్ర యూనిట్ వారికీ ధన్యవాదాలు తెలిపింది.

‘మా సినిమా గురించి స్పందించినందుకు ధన్యవాదాలు పీయూష్ గోయల్ జీ. సినిమాలు అనేవి ఒక దేశం సాఫ్ట్‌పవర్. భారతదేశ వృద్ధిలో చిన్న భాగం అయినందుకు మేము కూడా సంతోషిస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మరిన్ని భారతీయ చిత్రాలు బ్రేకింగ్ రికార్డులు సృష్టిస్తాయని ఆశిస్తున్నాము” అంటూ పోస్ట్ చిత్ర యూనిట్ చేసింది.

Thank you @PiyushGoyal ji for your kind words.

Films are a country’s soft power and we are glad to be a small part of India’s growth.

Here’s to hoping many more Indian films make path-breaking records at the Worldwide Box Office…🔥🌊 #RRRMovie https://t.co/zKQYS9GvSH— RRR Movie (@RRRMovie) April 3, 2022