మహేష్ బాబు కు పెద్ద చిక్కు వచ్చిపడింది

సూపర్ స్టార్ మహేష్ బాబు కు పెద్ద చిక్కువచ్చిపడింది. హీరోగానే కాకుండా నిర్మాణ రంగంలో కూడా మహేష్ రాణిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన అడివి శేషు హీరోగా ‘మేజర్’ అనే సినిమాను సోనీ పిక్చర్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ తో కలిసి మహేష్ నిర్మిస్తున్నారు. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ రూపొందుతుండగా..అడవి శేష్, సాయీ మంజ్రేకర్, శోబిత ధూళిపాళ్ళ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శశి కిరణ్ తిక్క డైరెక్టర్.

ఈ సినిమాను ఎప్పుడో మొదలుపెట్టినప్పటి కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేద్దామంటే సరైన డేట్ కుదరడం లేదు. ఇటీవలే ఫిబ్రవరి 11న ‘మేజర్’ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా మహేష్ బాబు టీమ్ ప్రకటించారు. అయితే అదేరోజు మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న ‘ఖిలాడి’ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. ‘ఖిలాడి’ సినిమా మీద భారీ అంచనాలు ఉండడం తో అదే రోజున ‘మేజర్’ చిత్రాన్ని రిలీజ్ చేయడం కరెక్ట్ డెసిషనేనా అని మేకర్స్ పునరాలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మహేశ్ హీరోగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’.. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ వల్ల పోస్ట్‌పోన్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన నిర్మాతగా రూపొందుతున్న ‘మేజర్’ కూడా వాయిదా వేయక తప్పదా.. అంటూ ఫిలిం సర్కిల్లో టాక్ నడుస్తుంది. మరి ఫైనల్ గా ఏంజరుగుతుందో చూడాలి.