ఆర్టీసీ బస్సు టాప్ ఫై ప్రసంగించిన రాహుల్

రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణ లో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. ఈ యాత్ర లో పలు ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో ఆదివారం చిన్నారులతో కలిసి పరుగులు పెట్టిన రాహుల్ ..సోమవారం అదే జిల్లా పరిధిలో ఏకంగా ఆర్టీసీ బస్సు టాప్ పైకి ఎక్కి ప్రసంగించి అందర్నీ ఆశ్చర్య పరిచారు.

సోమవారం నాటి యాత్ర ముగింపు సమయంలో ఆర్టీసీ కార్మికులతో రాహుల్ గాంధీ మాట్లాడేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏర్పాట్లు చేశారు. ఈ భేటీని కాస్తంత డిఫరెంట్ గా నిర్వహిద్దామన్న భావనతో ఆర్టీసీ బస్సు టాప్ ను వేదికగా ఎంచుకున్నారు. ఈ క్రమంలో అప్పటికే ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్లను బస్సు టాప్ పైకి ఎక్కించిన రేవంత్… ఆ తర్వాత తాను కూడా టాప్ ఎక్కారు. తన వెనకాలే రాహుల్ గాంధీని ఆయన బస్సు టాప్ పైకి ఆహ్వానించారు. రాహుల్ గాంధీ బస్సు టాప్ పైకి ఎక్కగానే… దేశ్ కీ నేత… రాహుల్ గాంధీ అంటూ కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశాయి. ఆ తర్వాత ఆర్టీసీ కార్మికులతో రాహుల్ గాంధీ మాట్లాడారు. రాహుల్ మాట్లాడేంత సేపు కార్య కర్తలు , అభిమానులు నినాదాలతో హోరెత్తించారు.