పవన్ కళ్యాణ్ ఫై మంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్ర విమర్శలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై వైస్సార్సీపీ మంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజారాజ్యం పార్టీకి ద్రోహం చేసిన వారికి సమాధానం చెబుతానన్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు వాళ్లతోనే కలిసి స్నేహం చేస్తున్నాడని విమర్శించారు. పవన్ కళ్యాణ్ విచక్షణ కోల్పోయి ఓ ఉన్మాదిలా మాట్లాడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబుకు దగ్గరై కాపు సామాజిక వర్గాన్ని కించపరుస్తున్నాడని , మీరు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. సంక్షేమ పథకాల్లో సీఎం వైయస్‌ జగన్‌ కాపులకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. చంద్రబాబు స్క్రిప్ట్‌నే పవన్‌ ఫాలో అవుతున్నారని విమర్శించారు. చంద్రబాబు ప్యాకేజీకి పవన్‌ అమ్ముడుపోయారని ఆరోపించారు.