వైసీపీ కి ఎంపీ రఘురామ రాజీనామా

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. 2019లో వైసీపీ నుంచి పోటీచేసి గెలిచిన ఈయన.. ఆ తర్వాత కొద్దికాలానికే పార్టీకి దూరమయ్యారు. పార్టీ అధినాయకత్వంపైనే యుద్ధం ప్రకటించి, విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు.

పార్లమెంటరీ సభ్యత్వం నుంచి అనర్హులుగా చేయడానికి మొహమ్మద్ గజినీలా చేసిన ప్రయత్నాలు ఇప్పటి వరకూ మీరు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని రాజీనామా లేఖలో రఘురామ పేర్కొన్నారు. ప్రయత్నించిన ప్రతిసారీ, మీ శత్రుత్వం, దురుద్దేశపూరిత క్రూరమైన చర్యలు ఉన్నప్పటికీ, గత 3.5 సంవత్సరాలుగా నర్సాపురంలో తన నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేశానన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం సేవ చేయాలనే తన దృఢ నిశ్చయానికి గుర్తుగా.. వైసీపీ ప్రాథమిక క్రియాశీల సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు లేఖలో రఘురామ వెల్లడించారు. వెంటనే ఆమోదించాలని కూడా కోరారు. అందరం ప్రజల తీర్పును కోరాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి, అది మన ఇద్దరికీ ఉన్న అసంబద్ధమైన అనుబంధం నుంచి ఒక్కసారైనా విముక్తి చేస్తుందని రఘురామ కృష్ణరాజు లేఖలో వ్యాఖ్యానించారు. ఇక నెక్ట్స్ ఏ పార్టీ తరుఫున పోటీ చేస్తారనేది చూడాలి.