సీఎం జగన్ కు రఘురామకృష్ణరాజు మరో లేఖ
సీపీఎస్ విధానం రద్దు చేయాలి..రఘురామకృష్ణరాజు
అమరావతి: ఏపీలో సీపీఎస్ విధానం రద్దు చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు సీఎం జగన్ కు మరో లేఖ రాశారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం జగన్ పాదయాత్రలో చేసిన సమయంలో సీపీఎస్ విధానం రద్దుచేస్తామని హామీ ఇచ్చారని రఘురామ గుర్తుచేశారు. పాత విధానాన్ని కొనసాగిస్తానన్నారని ఆయన అన్నారని, అందుకే ఆ ఎన్నికల సమయంలో ఉద్యోగుల నుంచి మద్దతు లభించిందని చెప్పారు.
తాము అధికారంలోకి వస్తే ఏడు రోజుల్లోనే ఈ హామీ నెరవేరుస్తామని చెప్పారని ఆయన తెలిపారు. ఇప్పటికీ ఆ హామీ నెరవేరలేదని విమర్శించారు. ఇప్పటికయినా జగన్ హామీని నిలబెట్టుకోవాలని సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని రఘురామ అన్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/