తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పుష్ప టీం
పుష్ప చిత్ర యూనిట్ బుధువారం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. డైరెక్టర్ సుకుమార్ , నటుడు సునీల్ తో పాటు నిర్మాతలు శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వారు రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ‘పుష్ప’ సినిమా విజయం సాధించిన నేపథ్యంలో శ్రీవారి సన్నిధికి వచ్చామని ఆ సినిమా యూనిట్ చెప్పింది.
అల్లు అర్జున్ – సుకుమార్ – దేవి శ్రీ కలయిక లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ పుష్ప గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పాజిటివ్ టాక్ తో గ్రాండ్ గా విడుదలైన ఈ మూవీ కి బ్లాక్ బస్టర్ టాక్ రావడం తో బాక్స్ ఆఫీస్ భారీ వసూళ్లు రాబడుతూ లాభాల బాట పడుతుంది. నిన్న ఈ మూవీ సక్సెస్ మీట్ ను తిరుపతి లో అట్టహాసంగా జరిపారు. ఇందులో భాగంగా హీరో అల్లుఅర్జున్, హీరోయిన్ రష్మిక, సునీల్, అనసూయ, దర్శకుడు సుకుమార్ పలు ఆసక్తికరమైన సంగతులను చెప్పారు. నాకు వచ్చిన క్రెడిట్ అంతా సుకుమార్కే దక్కుతుంది. ఆయనతో పాటు నా సహ నటులందరికీ కూడా. రష్మికతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. అదిరిపోయే ఆల్బమ్ను ఇచ్చిన దేవీశ్రీకి స్పెషల్ థ్యాంక్స్. నా ఫ్యాన్స్ అందరినీ గర్వించేస్థాయికి తీసుకెళ్తాను” అని అల్లుఅర్జున్ చెప్పుకొచ్చారు.