కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరుమార్పుకు కేబినెట్ ఆమోదం

ఏపీ క్యాబినెట్ సమావేశంలో 42 అంశాలపై చర్చ

cm jagan

అమరావతి : సీఎం జగన్ అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశం పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. 40కి పైగా అంశాలను ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. మూడో విడత అమ్మ ఒడి పథకం అమలుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

జులై నెలలో అమలు చేసే జగనన్న విద్యాకానుక, వైఎస్సార్ వాహనమిత్ర, కాపు నేస్తం తదితర పథకాల అమలుకు ఆమోదం తెలిపింది. అంతేకాదు, వివాదాస్పదమైన కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరిట నామకరణం చేసే ప్రతిపాదనకు కూడా క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దాంతోపాటే, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కూడా చర్చించి ఆమోదించినట్టు సమాచారం.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/