ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన పురందేశ్వరి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా దగ్గుపాటి పురంధేశ్వరి బాధ్యతలు చేపట్టింది. హైదరాబాద్‌ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టు కు చేరుకున్న ఆమెకు బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఎన్నికైన తర్వాత పురంధేశ్వరి తొలిసారిగా విజయవాడ కు వచ్చారు. కొద్దీ సేపటి క్రితం ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత, మాజీ సీఎం నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌, సునీల్‌ దేవ్‌ధర్‌, సీఎం రమేష్‌, పార్టీ నేతలు, తదితరులు పాల్గొన్నారు. సోము వీర్రాజు బీజేపీ జాతీయ వర్కింగ్‌ కమిటీ సభ్యుడిగా ఉన్న విషయం తెలిసిందే.

రాబోయే ఎన్నికలలో పురంధేశ్వరి నాయకత్వంలో ముందుకు వెళ్తామని.. 16 వ తేదీ ఎన్నికల కార్యాచరణపై ముఖ్య సమావేశం ఉందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. వచ్చే ఎన్నికలకు రోడ్ మ్యాప్, కార్యాచరణను కూడా అదే రోజు ప్రకటిస్తామని.. మెడికల్ విద్యార్థులకు అన్యాయం చేసే విధంగా ప్రభుత్వం జిఓ ఉందని వివరించారు. తెలంగాణ ఆంధ్ర ముఖ్యమంత్రులకు చీకటి ఒప్పందం ఉంది…ఆస్తులు ,మెడికల్ విధ్యార్దుల విషయంలో తెలంగాణ చేస్తున్న మోసాన్ని ఎందుకు ఆంధ్ర ముఖ్యంమత్రి పట్టించుకోవటం లేదన్నారు.