పీఎస్1 మూడు రోజుల కలెక్షన్స్

మణిరత్నం దర్శకత్వం వహించిన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ (పీఎస్1 ). లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. మొదటి భాగం పీయస్-1 (పొన్నియన్ సెల్వన్) శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా తమిళ్, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళంలో విడుదలైంది. విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్కుమార్, విక్రమ్ ప్రభు, శోభిత ధూళిపాళ, జయరామ్, ప్రభు, పార్తిబన్, ప్రకాష్రాజ్ కీలక పాత్రల్లో నటించారు.
విడుదలైన మూడు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 230 కోట్లు వసూలు చేసింది. ఈ రోజు రూ. 250 కోట్ల మార్క్ను అధిగమించబోతోంది. వసూళ్ల వర్షం ఇదే స్పీడ్లో కొనసాగితే ఈ చిత్రం తొందర్లనే బ్రేక్ ఈవెన్ సాధించి, లాభాల్లోకి దూసుకుపోయే అవకాశం ఉంది. ఇదే సమయంలో ‘పీఎస్1’ బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను బద్దలు కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘పొన్నియిన్ సెల్వన్’ ఐమాక్స్లో కూడా విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ స్క్రీన్లలో ఈ సినిమా రికార్డు సృష్టించింది. ఐమాక్స్ స్క్రీన్లలో ఉత్తర అమెరికా మినహా ప్రపంచ వ్యాప్తంగా ఆల్-టైమ్ నెం.1 ఓపెనింగ్ చిత్రంగా నిలిచింది.
అమెరికాలోని ఐమాక్స్ ల్లో ఆల్-టైమ్ నెం.3 ఓపెనింగ్ ను ఈ సినిమా రాబట్టింది. భారతదేశంలో ఐమాక్స్ లో ఆల్-టైమ్ నెం.4 గా నిలిచిందని రమేశ్ బాలా పేర్కొన్నారు. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది.