ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియకు నిరసన సెగ

ఈ మధ్య వరుసగా టిఆర్ఎస్ నేతలకు నిరసన సెగలు ఎదురవుతున్నాయి. తాజాగా ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియకు నిరసన సెగ ఎదురైంది. గార్ల మండలం పాకాల ఏటిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ మద్దివంచ గ్రామంలో ఎమ్మెల్యే హరిప్రియను గ్రామస్తులు అడ్డుకున్నారు.

హరిప్రియ కాన్వాయ్ కు అడ్డుగా ఉండి.. రోడ్డుపై బైఠాయించి.. నిరసన తెలిపారు. దీంతో గ్రామస్తులకు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. వెంటనే పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి.. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.