మంత్రి రోజా ఫై ఆగ్రహం వ్యక్తం చేసిన నాగబాబు

మెగా బ్రదర్స్ ఫై వైస్సార్సీపీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానులకు , చిత్రసీమకే కాదు సొంత పార్టీ నేతలకు , కార్యకర్తలకు కూడా నచ్చడం లేదు. గతంలో ఆమెతో ఉన్నవారు , జబర్దస్త్ షో చేసిన వారు సైతం ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదవులు ఎప్పుడు శాశ్వతం కాదని మనుషులు ముఖ్యమని గుర్తుంచుకోండి అంటూ వార్నింగ్ లు ఇస్తున్నారు. ఈ క్రమంలో మెగా బ్రదర్ , జనసేన నేత నాగబాబు సైతం రోజా ను హెచ్చరించారు.

‘మంత్రి రోజా.. భారతదేశ పర్యాటకశాఖ ర్యాంకింగ్స్‌లో ఉన్న 20 స్థానాల్లో మొదటి మూడు స్థానాల్లో కేరళ, అస్సాం, గుజరాత్‌లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలో ఉంది.. ఇంకా కిందకు వెళితే ఛత్తీస్‌గడ్, జార్ఖండ్‌లు ఉన్నాయి. నువ్వు ఇలాగే నీ బాధ్యతను మర్చిపోయి.. నోటికొచ్చినట్లు పిచ్చ పిచ్చగా మాట్లాడితే అతి త్వరలో అంటే నువ్వు పదవి దిగిపోయేలోగా 20వ స్థానంకు దిగజారే అవకాశం ఉంది’ అన్నారు.

‘ఏపీ పర్యాటకశాఖ మీద కొన్ని వేలమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా బతుకుతున్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక వాళ్ల జీవితాలు మట్టికొట్టుకుపోయాయి. నువ్విలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వాళ్ల పరిస్థితి మరింత దిగజారిపోతుంది. ముందు పర్యాటశాఖ మంత్రిగా నీ బాధ్యతలు నువ్వు తెలుసుకో.. పర్యాటకశాఖ మంత్రి అంటే నువ్వు పర్యటన చేయడం కాదు. పర్యాటకశాఖను ఎలా డెవలప్‌ చేయాలో చూడాలి’అంటూ ఘాటుగా స్పందించారు.

‘నువ్వు ఇన్ని రోజులు మా అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి నోటికొచ్చినట్లు వాగినా కూడా.. అఫ్‌కోర్స్ నా గురించి మాట్లాడావ్.. నేను లెక్క చేయను. మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్, మా అన్నయ్య చిరంజీవి గురించి నోటికొచ్చినట్లు వాగినా కూడా నేను ఎందుకు రియాక్ట్ అవ్వలేదంటే.. ఒకటే ఒక్క కారణం ఉంది. నీ నోటికి మున్సిపాలిటీ కుప్పతొట్టికి పెద్ద తేడా లేదు.. చూస్తా చూస్తా మున్సిపాలిటీ కుప్పతొట్టిని గెలకరు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని పర్యాటకశాఖను ఎలా డెవలప్‌ చేయాలో చూడు’ అంటూ ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు.