రెజ్లింగ్ లో ప్రియా మాలిక్ స్వర్ణం
భారత సంచలనం
![Priya Malik wins gold in wrestling](https://www.vaartha.com/wp-content/uploads/2021/07/Priya-Malik-wins-gold-in-wrestling-1024x583.jpg)
టోక్యో ఒలింపిక్స్లో ఆదివారం భారత రెజ్లర్ ప్రియా మాలిక్ బంగారు పతకం గెలిచి భారత దేశ పతాకాన్ని రెపరెపలాడించింది.. రెజ్లింగ్ వరల్డ్ క్యాడెట్ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది. హంగేరీలో జరుగుతున్న ఈ రెజ్లింగ్ పోటీల్లో 73 కేజీల విభాగంలో ఫైనల్లో విజయం సాధించి టోక్యో ఒలింపిక్స్లో ఆదివారం భారత రెజ్లర్ ప్రియా మాలిక్ బంగారు పతకం గెలిచి భారత దేశ పతాకాన్ని రెపరెపలాడించింది.. రెజ్లింగ్ వరల్డ్ క్యాడెట్ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది. హంగేరీలో జరుగుతున్న ఈ రెజ్లింగ్ పోటీల్లో 73 కేజీల విభాగంలో ఫైనల్లో విజయం సాధించి పసిడి కైవసం చేసుకుంది. టోక్యో ఒలింపిక్స్లో మీరాభాయ్ ఛాను రజతం గెలిచిన తర్వాతి రోజే, మరో ప్రపంచ క్రీడా వేదికపై భారత మహిళా అథ్లెట్లు సత్తా చాటడం విశేషం. భారత రెజ్లర్లపై భారీ అంచనాలే ఉన్నాయి. 57 కేజీల విభాగంలో రవి కుమార్ దహియా, 65 కేజీల విభాగంలో భజరంగ్ పూనియా, 86 కేజీల విభాగంలో దీపక్ పూనియా పురుషుల జాబితాలో పోటీపడనుండగా మహిళల విభాగంలో సీమా, వినేశ్ ఫోగర్, అన్షు, సోనమ్ బరిలో దిగబోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/