రోడ్డు ప్రమాదం.. 37 మందికి గాయాలు

Road accident in Guntur district
Road accident in Guntur district

యడ్లపాడు: ఓ ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సు బోల్తా పడిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. బెంగళూరు నుంచి విజయవాడకు వస్తున్న సమయంలో 16వ జాతీయ రహదారిపై గుంటూరు జిల్లా యడ్లపాడు వద్ద బోల్తా పడింది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసే సమయంలో బస్సు డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డు అవతల వైపు వెళ్లి పడింది. అయితే ఈ ప్రమాదంలో 30 మందికి స్వల్పగాయాలు కాగా, మరో ఏడుగురికి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/