డెన్మార్క్లోని కోపెన్హెగన్ చేరుకున్న ప్రధాని మోడీ
కోపెన్హెగన్: ప్రధాని నరేంద్ర మోడీ యూరప్ పర్యటనలో ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ప్రధాని మోడీ జర్మనీ నుంచి డెన్మార్క్ రాజధాని కోపెన్హెగన్ చేరుకున్నారు. విమానాశ్రయంలో డెన్మార్క్ ప్రధాని మెటె ఫ్రెడ్రిక్సన్ ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికారు. అనంతరం కోపెన్హెగన్లో ఉన్న ఆ దేశ ప్రధాని మెట్టి ఫ్రెడ్రిక్సన్ నివాసంలో జరిగిన చర్చల్లో మోడీ పాల్గొన్నారు. ఫ్రెడ్రిక్సన్ నివాసంలో ఉన్న పచ్చిక లాన్లో ఇద్దరూ తిరుగుతూ వివిధ అంశాలపై ముచ్చటించుకున్నారు. చాలా సహజసిద్ధమైన ప్రకృతి మధ్య నేతలిద్దరూ కీలక అంశాలను చర్చించుకున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/