రాష్ట్రపతి ఉత్తర్వులపై వివరాలివ్వాలి
Telangana: రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల అమలుపై శాఖల వారీగా వివరాలు అందించాలని తెలంగాణ రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్ అన్నారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. శాసనసభ సమావేశాల సన్నద్ధత, రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల అమలుపై సమీక్షించారు. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వులపై వివరాలను మార్చి 4లోగా సాధారణ పరిపాలనా శాఖకు అందించాలన్నారు. జీఏడీ, ఆర్థిక శాఖల పరిశీలనలకు అనుగుణంగా పోస్టుల వివరాలివ్వాలన్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/