కర్ణాటక ఫలితాలపై నటుడు ప్రకాష్ రాజ్ ట్వీట్

కర్ణాటక ఎన్నికల ఫలితాలపై నటుడు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో మోడీ నిజస్వరూపం అంటూ ట్వీట్ చేశాడు. నెకెడ్ ఫైల్స్, కర్ణాటక స్టోరిలు ఇవే అంటూ కామెంట్ చేశాడు. కర్ణాటక రాజకీయాల్లో హిట్లర్ తరహా రాజకీయాలు మోడీ చేస్తున్నాడు. చక్రవర్తి వేసే డ్రస్సులు, ఆయన నిజస్వరూపం ఇదే అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

హిట్లర్ తరహా హావభావాలను మోడీ ప్రదర్శిస్తున్నాడు. ఏనాటికైనా హిట్లర్ అనుభవించిన ఫలితాన్ని మోడీ కూడా అనుభవించడం ఖాయం అని ప్రకాశ్ రాజ్ జోస్యం తెలిపాడు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

ఇరాక్ కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దాదాపు 135 సీట్లు సాధించి చాలా కాలం తర్వాత సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ విజయానికి కాంగ్రెస్ నేతలంతా ఏకతాటిపైకి వచ్చి నడవడంతో పాటు రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర కూడా కారణమైంది. ఈ విజయం పట్ల రాహుల్ గాంధీ స్పందించారు. మీడియాతో తన సంతోషాన్ని పంచుకున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. వారి కృషి కారణంగానే కాంగ్రెస్ గెలిచిందన్నారు.