ప్రగతి భవన్ లో ఘనంగా ఉగాది వేడుకలు
సీఎం కెసిఆర్ కు వేదపండితుల వేదాశీర్వచనం
శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలను శనివారం ప్రగతి భవన్లో ఘనంగా నిర్వహించారు . ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం శుభకృత్ నామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. బాచంపల్లి సంతోష్కుమార్ శాస్త్రి పంచాంగ పఠనం చేశారు.
ఈ ఏడాది 75 శాతం అంతా మంచే ..
తెలంగాణకు ఈ ఏడాది 75 శాతం మంచి జరుగుతుందని పంచాంగ పఠనంలో చెప్పారు. తెలంగాణలో వర్షాలు పడతాయని, పంటలు పండుతాయని తెలిపారు. ఈ ఏడాది ఉద్యోగ నామ సంవత్సరం అని పంచాంగం కూడా చెబుతుందని సంతోష్ కుమార్ తెలిపారు. పాలనా పరంగా కూడా అన్ని రకాలుగా మంచి జరుగుతుందని ఆ చెప్పారు.
‘మండలి’ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/