ఎమ్మెల్యే షకీల్ అమీర్కు వ్యతిరేకంగా పోస్టర్లు..

బిఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ అమీర్కు వ్యతిరేకంగా నిజామాబాద్ జిల్లా బోధన్లో పోస్టర్లు విలిసాయి. ఇటీవల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే..తానే కొంటా అని చెప్పిన ఎమ్మెల్యే షకీల్.. 20 రోజులుగా అదృశ్యం అయ్యడంటూ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు.

జాడలేని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ అంటూ కొన్ని ప్లెక్సీ లలో పేర్కొన్నారు. వడగండ్ల వానలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటానని జాడ లేకుండా పోయినవ్ చెప్పిన నాటి నుంచి ఇప్పటి దాకా గింజకూడా ధాన్యం కొనలే. ఇప్పటికైనా కళ్లు తెరుచుకుని ప్రతి గింజ ధాన్యం కొనాల్సిందే అని పేర్కొన్నారు.

మరికొన్ని ప్లెక్సీ లలో కనపడుట లేదు.. తడిచిన ధాన్యాన్ని నేనే కొంటానన్న ఎమ్మెల్యే షకీల్ అమీర్ గారు.. చెప్పిన నాటి నుంచి ఇప్పటి వరకు గింజ కొనని ఎమ్మెల్యే షకీల్ గారు.. ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రతీ ధాన్యం గింజను కొనాల్సిందే.. అంటూ పేర్కొన్నారు.