ఖబడ్దార్‌ బీజేపీ.. అంటూ మునుగోడులో పోస్టర్లు హల్చల్

ఖబడ్దార్‌ బీజేపీ.. మునుగోడులో మీకు గోరీ కడతామని లంబాడి హక్కుల పోరాట సమితి పేరిట పోస్టర్లు వెలిశాయి. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక ఫై తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. ఈ ఉప ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని బిజెపి , కాంగ్రెస్ తో పాటు టిఆర్ఎస్ చూస్తుంది. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగిసింది. దీంతో పార్టీల నేతలంతా మునుగోడు లోనే ఉంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఇంటి గడప తొక్కుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటె మునుగోడు నియోజకవర్గంలో బిజెపి కి వ్యతిరేకంగా పోస్టర్లు వెలుస్తూనే ఉన్నాయి.

ఖబడ్దార్‌ బీజేపీ.. మునుగోడులో మీకు గోరీ కడతామని లంబాడి హక్కుల పోరాట సమితి హెచ్చరించింది. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఢిల్లీలో బీజేపీ కుట్రలు చేస్తున్నదని ఆరోపిస్తూ ఆ పార్టీకి వ్యతిరేకంగా చండూరు మున్సిపాలిటీలో పోస్టర్లు వెలిసాయి. రాజగోపాల్‌ రెడ్డి ద్వారా లంబాడీల ఓట్లను కొనాలని ఆ పార్టీ నాయకులు దుష్ట రాజకీయాలు చేస్తున్నారని పోరాట సమితి విమర్శించింది. తాము అమ్ముడుపోయే వాళ్లం కాదని, బానిసలం అంతకన్నా కాదని.. లంబాడి బిడ్డలమని హెచ్చరించారు.