దుబాయ్‌లో ఘనంగా నటి పూర్ణ వివాహం

నటి పూర్ణ వివాహ బంధంతో ఓ ఇంటిది అయ్యింది.మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్గా పరిచయమైన ఈ భామ.. తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించి ఫేమస్ అయింది. శ్రీమహాలక్ష్మి ఫిల్మ్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత వరుసగా పలు చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. కేవలం వెండితెర ఫై మాత్రమే కాదు బుల్లితెర ఫై కూడా మెరిసింది.

తాజాగా ఈమె దుబాయ్ లో స్థిరపడిన వ్యాపారవేత్త జేబీఎస్ గ్రూప్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో శానిద్ ఆసిఫ్ ఆలీని షమ్న కాసిం ను పెళ్లి చేసుకొని ఓ ఇంటిది అయ్యింది. వీరి వివాహం సోమవారం దుబాయ్ లో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో షమ్న కాసిం, ఆసిఫ్ అలీ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత రిసెప్షన్ కూడా నిర్వహించారు. వీరి పెళ్లి పిక్స్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.