చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్.. విచారణ వాయిదా
ఈ పిటిషన్ విచారణను బుధవారానికి వాయిదా వేసిన హైకోర్టు
అమరావతిః ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఈ పిటిషన్ ను బుధవారం విచారించనున్నట్లు ఏపీ హైకోర్టు వెల్లడించింది. చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ కు 500 పేజీల వివరణతో సీఐడీ కౌంటర్ దాఖలు చేసింది. దీంతో చంద్రబాబు పిటిషన్ ను బుధవారం విచారిస్తామని పేర్కొంటూ విచారణను జడ్జి వాయిదా వేశారు.