BRS నుండి 20 మంది ఎమ్మెల్యేలు..కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు బాంబ్ పేల్చిన పొంగులేటి

బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరో బాంబ్ పేల్చారు. అతి త్వరలో బిఆర్ఎస్ నుండి 20 మంది ఎమ్మెల్యేలు , పలువురు ఎంపీలు కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు తెలిపి షాక్ ఇచ్చారు. ఆదివారం ఖమ్మం లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన జన గర్జన సభ లో పొంగులేటి తో పాటు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సభ తో పొంగులేటి తన సత్తా చాటుకున్నారు. లక్షలాది మంది ఈ సభకు హాజరై..పొంగులేటి బలగాన్ని అధిష్టానికి తెలియజేసారు.

ఇక సోమవారం పొంగులేటి మాట్లాడుతూ.. బిఆర్ఎస్ నుండి 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు అలాగే మంత్రులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ బాంబు పేల్చారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో 10 సీట్లకు 10 సీట్లు గెలుస్తుందని… తెలంగాణలో మొత్తం 100 సీట్లు గెలవబోతుందని జోష్యం చెప్పారు పొంగులేటి.