మరికాసేపట్లో హైదరాబాద్‌‌‌కు రానున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు వేడుకల సందర్బంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేడు హైదరాబాద్ రానున్నారు. ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్ఫోర్స్ స్టేషన్ కు చేరుకోనున్న ఆమె… అక్కడి నుంచి నేరుగా రాష్ట్రపతి భవన్ కు వెళ్లనున్నారు. రాష్ట్రపతి నిలయంకు పర్యాటకుల సందర్శన తీరును రాష్ట్రపతి ముర్ము సమీక్షించనున్నారు. నగర ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించొద్దన్న ఉద్దేశ్యంతో సాయంత్రం 5 గంటలకు హెలికాప్టర్‌లో గచ్చిబౌలి స్టేడియానికి చేరుకుంటారు.

ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించే అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు వేడుకల్లో రాష్ట్రపతి పాల్గొంటారు. రాష్ట్రపతి రానున్న నేపథ్యంలో ఆమె పర్యటిస్తున్న ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. అలాగే మార్గంలో రోడ్లకు మరమ్మతులు చేయడం. బారికేడ్లు, తగిన బందోబస్తు ఏర్పాట్లు చేయడం చేసారు. పర్యటన సందర్భంగా నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా చూసారు.