అస్సాంలో రూ. 200 కోట్లతో మోడీ విగ్రహం

ఒకప్పడు దేశం కోసం పోరాటం చేసిన మహనీయుల తాలూకా విగ్రహాలను ఏర్పాటు చేసేవారు కానీ ఇప్పుడు సినీ స్టార్స్ విగ్రహాలతో పాటు రాజకీయ నేతల విగ్రహాలను ఏర్పాటు చేయడం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ నేతల తాలూకా విగ్రహాలు ఏర్పాటు చేసి వారి అభిమానాన్ని చాటుకోగా..తాజాగా ప్రధాని మోడీ విగ్రహాన్ని దాదాపు రూ.200 కోట్లతో నిర్మించబోతున్నారు.

అస్సాంకు చెందిన వ్యాపారవేత్త నవీన్ చంద్ర బోరా ప్రధాని మోదీకి వీరాభిమాని. ఆయన పట్ల తన అభిమానాన్ని చాటుకునేందుకు గాను 190 అడుగుల ఎత్తైన మోదీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం సుమారు రూ. 200 కోట్లు వెచ్చించనున్నారు. గువాహటి సమీపంలో ఉన్న తన సొంత స్థలంలో ఈ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. దీనికోసం మూడు రోజుల పాటు భూమి పూజ చేస్తున్నామని ఆయన తెలిపారు.

పీఠభాగంతో కలుపుకొని విగ్రహం ఎత్తు 250 అడుగులు ఉంటుందని నవీన్‌చంద్ర తెలిపారు. విగ్రహం మెడ భాగంలో అసోంసంస్కృతికి చిహ్నంగా గమోసా (అసోం ప్రజలు ధరించే ఖద్దరు వస్తం) ఉంటుందని ఆయన వివరించారు. విగ్రహ ప్రతిష్ఠాపన వివరాలతో గతేడాది ప్రధాని కార్యాలయానికి లేఖ కూడా పంపినట్లు తెలిపారు.