పార్వతీకుండ్ ఆలయంలో పరమశివుడి దర్శనం చేసుకున్న మోడీ

స్థానిక సంప్రదాయ దుస్తుల్లో పూజాదికాలు నిర్వహించిన వైనం

PM Modi Performs Puja at Pithoragarh’s Parvati Kund

న్యూఢిల్లీః గురువారం ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ పితోర్ఘడ్ జిల్లాలోని పార్వతీ కుండ్ వద్ద పరమశివుడి దేవాలయాన్ని సందర్శించారు. స్థానిక సంప్రదాయ దుస్తుల్లో మోడీ అక్కడ పూజాదికాలు నిర్వహించారు. ఢమరుకం, శంఖానాదాలతో పరమేశ్వరుడిని అర్చించారు. ఆ తరువాత ప్రధాని మోడీ పరమశివుడు కొలువైన ఆది కైలాశ్ పర్వతాన్ని కూడా సందర్శించనున్నారు. అక్కడి జగదేశ్వర్ ధామ్, సరిహద్దున ఉన్న గుంజీ గ్రామాన్ని కూడా సందర్శిస్తున్నారు.

కాగా, నేటి పర్యటనలో మోడీ జిల్లాలో రూ.4200 కోట్ల విలువైన పలు అభివృద్ధికార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రధాని మోడీ పర్యటనతో కుమోన్ ప్రాంతంలో ఆధ్యాత్మిక పర్యటన ఊపందుకుంటుందని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.