జగద్గురు శ్రీశాంత్ తుకారాం మహారాజ్ ఆలయాన్నిప్రారంభించిన ప్రధాని

మోడీకి తుంబుర, చిడతలు బహూకరించిన ఆలయ వర్గాలు

YouTube video
PM Modi Inaugurates Jagadguru Shrisant Tukaram Maharaj Temple in Dehu, Pune

పుణే : నేడు పుణేలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. ఇక్కడి డెహూ ప్రాంతంలో సంత్ తుకారామ్ ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. 17వ శతాబ్దానికి చెందిన ప్రముఖ వాగ్గేయకారుడు సంత్ తుకారామ్ పేరిట ఈ ఆలయం నిర్మించారు. ఈ ఆలయంలో మోడీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయ పాలకమండలి సభ్యులు ప్రధాని మోదీకి తుంబుర, చిడతలు బహూకరించారు. తుంబుర చేతబూనిన ప్రధాని మోడీ చిడతలను వాయించారు. సంత్ తుకారామ్ అభంగ పేరిట భక్తి సాహిత్యాన్ని లిఖించారు. అనేక కీర్తనలను రచించారు. ఆయన మరణానంతరం చిన్న శిల్పమందిరం ఏర్పాటు చేసినా, ఇటీవల దానికి ఆలయ రూపు కల్పించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/