మొజాంబిక్‌ అధ్యక్షుడితో ప్రధాని మోడీ సమావేశం

pm-modi-holds-a-bilateral-meeting-with-mozambique-president-filipe-jacinto-nyusi-in-gujarat

న్యూఢిల్లీః : ప్రధాని నరేంద్రమోడీ మొజాంబిక్‌ అధ్యక్షుడు ఫిలిప్‌ జసింటో నుయిషీతో భేటీ అయ్యారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఈ భేటీ జరిగింది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతోపాటు తదితర అంశాలపై వారు చర్చించారు. గాంధీనగర్‌లో జరుగుతున్న వైబ్రాంబ్‌ గుజరాత్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ లో పాల్గొనేందుకు మొజాంబిక్‌ అధ్యక్షుడు మంగళవారం ఉదయం గుజరాత్‌కు వచ్చాడు.

బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజులపాటు ఈ వైబ్రాంట్‌ గుజరాత్‌ గ్లోబల్‌ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు మొజాంబిక్‌ అధ్యక్షుడు ఫిలిప్‌ను అతిథిగా ఆహ్వానించారు. సౌదీ అరేబియా అధ్యక్షుడు కూడా సదస్సు కోసం ఈరోజు భారత్‌కు రానున్నారు. ఈ వైబ్రాంట్‌ గుజరాత్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు వివిధ దేశాల్లోని పలు కంపెనీల సీఈవోలు హాజరుకానున్నారు.