కేసీఆర్పై రాష్ట్ర ప్రజలకు విశ్వాసం పోయింది – బండి సంజయ్
హుజురాబాద్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతోంది. ఇప్పటివరకు 15 రౌండ్లు పూర్తికాగా..అందులో రెండు రౌండ్ లలో మాత్రమే తెరాస ఆధిక్యం చూపించింది. ప్రస్తుతం ఈటెల విజయం దాదాపు ఖరారైందగా తెలుస్తుంది. ఈ క్రమంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు.
ఈటల రాజేందర్ భారీ విజయం సాధించడం ఖాయమన్నారు. బీజేపీ ఎమ్మెల్యేగా ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టడం నిశ్చయమని అన్నారు. ‘‘ఈటల రాజేందర్ బీజేపీ నాయకుడు. ఈటల గెలుపు బీజేపీ గెలుపు.. బీజేపీ గెలుపు ఈటల గెలుపే” అని బండి సంజయ్ చెప్పారు. సీఎం కేసీఆర్పై రాష్ట్ర ప్రజలకు విశ్వాసం పోయిందని అన్నారు. హుజురాబాద్ ఎన్నికల ముందు దళిత బంధు పథకం పెట్టి అమలు చేసినా ఆయనను ప్రజలు నమ్మలేదని చెప్పారు. ఈటల గెలుపుతో తెలంగాణలో అధికార మార్పిడిని ప్రజలు కోరుకుంటున్నారనేది స్పష్టమైందని తెలిపారు.