న‌మో భార‌త్ రైలును ప్రారంభించిన ప్ర‌ధాని మోడీ

PM Modi flags off first train of Delhi-Meerut RRTS service

న్యూఢిల్లీ: ఈరోజు ప్ర‌ధాని మోడీ ఢిల్లీ, ఘ‌జియాబాద్‌, మీర‌ట్‌ మ‌ధ్య రీజిన‌ల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్ట‌మ్‌(ఆర్ఆర్‌టీఎస్) కారిడార్‌ను ప్రారంభించారు. 17 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఆ కారిడార్‌ను ప్ర‌జ‌ల కోసం ఈనెల 21వ తేదీన అందుబాటులోకి వ‌స్తుంది. ర్యాపిడ్ఎక్స్ ట్రైన్‌ను న‌మో భార‌త్ అని రైలుగా కూడా పిలుస్తున్నారు. స‌హిబాబాద్ నుంచి దుహాయి డిపో మ‌ధ్య రైలును న‌డిపారు. ఆ రైలులో ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌టించారు. స్కూల్ పిల్ల‌లు, సిబ్బందితో ఆయ‌న రైలులో ముచ్చ‌టించారు. ఢిల్లీ-మీర‌ట్ కారిడార్ మొత్తం 2025 నాటికి పూర్తి కానున్న‌ట్లు తెలుస్తోంది.

ఆర్ఆర్‌టీఎస్ కారిడార్ కోసం స‌హిదాబాద్ స్టేష‌న్‌లో ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కారిడార్ పూర్తి అయితే కేవ‌లం గంట లోపే ఆ దూరాన్ని చేరుకునే అవ‌కాశం ఉంటుంది. యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌, కేంద్ర మంత్రి హ‌ర్దీప్ సింగ్ పురి కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. క‌నీస టికెట్ ధ‌ర రూ.20 కాగా, గ‌రిష్టంగా రూ.100 టికెట్ ఉండ‌నున్న‌ది. ఢిల్లీ, హ‌ర్యానా, రాజ‌స్థాన్‌, యూపీ ప్ర‌భుత్వాల స‌హకారంతో ఆర్ఆర్టీఎస్ కారిడార్‌ను నిర్మిస్తున్నారు.