ఎవరినో కించపరచాలనే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదు – కేటీఆర్ క్లారిటీ

KTR comments ap power cuts

ఏపీ ఫై మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారం రేపుతున్నాయి. వరుసగా వైసీపీ నేతలు కేటీఆర్ ను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ తన వ్యాఖ్యలకు క్లారిటీ ఇచ్చారు.

తన వ్యాఖ్యల వెనక ఎలాంటి దురుద్దేశం లేదని వివరణ ఇచ్చారు. ఏపీలోని తన స్నేహితులను తెలియకుండానే తన వ్యాఖ్యలతో కొంత బాధ పెట్టి ఉండొచ్చన్నారు. అయితే, ఎవరినో కించపరచాలనో, బాధపెట్టాలనో తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని, అన్యాపదేశంగానే అవి తన నోటి వెంట వచ్చాయని అన్నారు. ఏపీ సీఎం జగన్‌ను తన సోదరుడిగా భావిస్తానని, ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నట్టు కేటీఆర్ ట్వీట్ చేసారు. మరి ఈ ట్వీట్ తో వైస్సార్సీపీ నేతలు మాటల దాడి తగ్గిస్తారని అనుకోవచ్చు.

అసలు కేటీఆర్ ఏమని కామెంట్స్ చేసారంటే..నిన్న శుక్రవారం హెచ్ఐసీసీలో జరిగిన ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో ఏపీలో పరిస్థితులపై కేటీఆర్ కామెంట్స్ చేసారు. ఏపీలో క‌రెంట్ లేదని.. నీళ్ళు లేవని.. రోడ్లు ధ్వంసం అయ్యాయన్నారు.అక్కడి పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. తన మిత్రుడు ఊరినుంచి తిరిగి హైదరాబాద్ వచ్చాక ఊపిరి పీల్చుకున్న‌ట్లు ఉందని చెప్పాడన్నారు. ఈ కామెంట్స్ ఫై వైసీపీ నేతలు వరుసపెట్టి కౌంటర్లు వేయడం మొదలుపెట్టారు.

It appears that an innocuous comment that I had made at a meeting earlier today may have caused some unintentional pain to my friends in AP

I enjoy a great brotherly equation with AP CM Jagan Garu & wish that the state prospers under his leadership— KTR (@KTRTRS) April 29, 2022