నేడు పలు రాష్ట్రాల సిఎంలతో ప్రధాని చర్చ

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆరోగ్యశాఖ మంత్రులతో ప్రధాని మోడి ఈరోజు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మహారాష్ట్ర, ఏపి, కర్ణాటక, ఉత్తర్ప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్ సీఎంలు, ఆరోగ్యశాఖ మంత్రులతో జరిగే వర్చువల్ సమావేశంలో ప్రధాని కొవిడ్ నియంత్రణ చర్యలపై సమీక్షించనున్నారు.
దేశంలో 63శాతం యాక్టివ్ కేసులు ఈ ఏడు రాష్ట్రాల్లోనే ఉండగా, మొత్తం కరోనా కేసుల్లో 65.5శాతం, మరణాల్లో 75 శాతం వరకు ఆయా రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. కాగా మహమ్మారి కట్టడికి ఆయా రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు, కేంద్రం సహకారం, ఆరోగ్య, వైద్య మౌలిక సదుపాయాల పెంపు తదితర అంశాలను సైతం చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/