17న భారత్-బంగ్లా ప్రధానుల వర్చువల్ సమావేశం
న్యూఢిల్లీ: ఈనెల 17న ప్రధాని నరేంద్రమోడి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో భేటీ కానున్నారు. వర్చువల్ పద్ధతిలో ఈ సమావేశం జరుగనుంది. ఈ సందర్భంగా నేతలిద్దరూ ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్రమైన చర్చ జరుపనున్నారు. వివిధ రంగాల్లో పరస్పర సహకారానికి సంబంధించి కీలక ఒప్పందాలు చేసుకోనున్నారు. కొవిడ్ అనంతరం రెండు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉన్నది. ఈ భేటీకి సంబంధించిన సమాచారాన్ని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/