పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

పెట్రోల్, డీజిల్ ధరలపై 60 పైసల చొప్పున పెంపు

petrol-and-diesel
petrol-and-diesel

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను ఈ రోజు దాదాపు 60 పైసల చొప్పున పెంచినట్లు చమురు సంస్థలు తెలిపాయి. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం ఇది వరసగా రెండో రోజు. ఢిల్లీలో నిన్న రూ.71.86 గా ఉన్న లీటరు పెట్రోల్ ధర ఈ రోజు రూ.72.46గా ఉంది. లీటరు డీజిల్ ధర నిన్న రూ.69.99గా ఉండగా ఈ రోజు రూ.70.59గా ఉంది. కాగా కొన్ని రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగకుండా స్థిరంగా ఉన్న విషయం తెలిసిందే. నిన్నటి నుంచి ధరలు మళ్లీ పెరగడం గమనార్హం.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/