రాజధానిలో లే అవుట్ వేయడంపై హైకోర్టులో పిటిషన్
కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు
అమరావతి: రాజధానిలో ఆర్ఫైవ్ జోన్ ఏర్పాటుపై అభ్యంతరాలు పూర్తి కాకుండానే లే అవుట్లు వేయంతో దీనిపై హైకోర్టులో పిటీషన్ దాఖలు అయింది. ఇందులో ఆర్ఫైవ్ జోన్పై అభ్యంతారాలు స్వీకరించేందుకు ఇంకా గడువు ఉండగా నేలపాడులో లే అవుట్ వేయడంతో ఇందుకు సంబందించిన విడియో పిటిషన్తో జత చేశారు.దీనిని విచారించిన న్యాయస్థానం కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి పదిరోజుల సమయం కావాలని ఏజి కోరడంతో, అందుకు ధర్మాసనం సమయమిచ్చింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/