మూడు రాజధానుల ఫై అసెంబ్లీలో సీరియస్ గా చర్చ జరుపుతుంటే..మంత్రి పేర్ని నాని మాత్రం నిద్రపోతున్నాడు

ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన ఒకే టాపిక్ నడిచింది అదే ఏపీ మూడు రాజధానుల విషయంలో జగన్ సర్కార్ వెనక్కు తగ్గడం. సోమవారం ఉదయం ప్రభుత్వ తరుపు లాయర్ ఈ ప్రకటన చేసినప్పటికీ ..అసెంబ్లీ లో జగన్ దీనిపై ఏం మాట్లాడుతారో అని అంత టీవీలకు హత్తుకుపోయారు. అసెంబ్లీ లో మంత్రి బుగ్గన దీనిపై మాట్లాడుతుంటే మంత్రి పేర్ని నాని మాత్రం హాయిగా నిద్రపోతున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ వీడియోనే వైరల్ గా షేర్ అవుతుంది.

అసెంబ్లీలో మంత్రి బుగ్గన మాట్లాడుతున్న సమయంలో మంత్రి పేర్ని నాని సభలో నిద్రపోయారు. మంత్రి బుగ్గన మాట్లాడుతున్న సమయంలో… మంత్రి పేర్ని నాని కునుకు తీయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన తెలుగు దేశం పార్టీ నాయ కుడు అలాగే సోషల్ మీడియా వారియర్స్ సెటైర్లు పేల్చుతున్నారు.

మంత్రి బుగ్గన ఏమాట్లాడారు అనేది చూస్తే.. అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితమైతై వేర్పాటు వాదం వస్తుందని శ్రీకృష్ణకమిటీ చెప్పిన సంగతి గుర్తు చేశారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాలని శ్రీకృష్ణ కమిటీ చెప్పిందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని శివరామకృష్ణన్‌ కమిటీ స్పష్టం చేసిందని తెలిపారు. బిల్లుపై చర్చ అనంతరం మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం తెలిపింది.

https://youtube.com/watch?v=zUEfCZ0mW8M