అమెరికాలో తెలంగాణ యువ‌కుడు మృతి

హైదరాబాద్ : న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన మండ‌లి శేఖ‌ర్‌(25) అనే యువ‌కుడు అమెరికాలో మృతి చెందాడు. అమెరికాలోని ఎల్లికాట్ న‌గ‌రంలో రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. మృతుడు మండలి శేఖర్.. వయసు 28 సంవత్సరాలు. స్వస్థలం నల్గొండ జిల్లాలోని గుర్రంపోడు మండలం తెరాటి గూడెం. గత రెండేళ్లుగా శేఖర్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. శేఖర్ మరణవార్తను అమెరికా అధికారులు అతడి తల్లిదండ్రులకు తెలియజేశారు. కాగా, తమ కుమారుడి మృతదేహం అమెరికాలో ఉందని, భారత్ కు తీసుకువచ్చేందుకు సాయపడాలని అతడి తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని అర్థిస్తున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/