బిఆర్ఎస్ మంత్రులకు షాక్ ఇచ్చిన ప్రజలు

vikarabad-municipal-chair-person-resigns-to-brs

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ముందు నుండి అంత భావించినట్లు కాంగ్రెస్ – బిఆర్ఎస్ మధ్య పోరు నడుస్తుంది. మెజార్టీ స్థానంలో కాంగ్రెస్ దూకుడు కనపరుస్తుంది. అయితే అంత భావించినట్లే రాష్ట్ర ప్రజలు బిఆర్ఎస్ మంత్రులకు షాక్ ఇచ్చారు. పలువురు బీఆర్ఎస్ మంత్రులు వెనుకంజలో ఉన్నారు. ధర్మపురి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, నిర్మల్ అభ్యర్థి ఇంద్రకరణ్ రెడ్డి, బాల్కొండ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి, ఖమ్మం అభ్యర్థి పువ్వాడ అజయ్, పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు వెనుకంజలో కొనసాగుతున్నారు.