ఢిల్లిలో భారీగా పొగమంచు
New Delhi: ఢిల్లిలో భారీగా పొగమంచు కమ్మేయడంతో కొద్ది దూరం కూడా స్పష్టంగా కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఢిల్లికి రావలసిన పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. కనీసం 21 రైళ్లు గంటనుంచి ఆరు గంటల ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వే శాఖ చీఫ్ పిఆర్ఒ చెప్పారు. ఆలస్యంగా నడుస్తున్న రైళ్ల జాబితాను ఆయన విడుదల చేశారు.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/