నేడు ప్రధానితో పవన్ కల్యాణ్ భేటి?
పలువురు బిజెపి ముఖ్య నేతలతో పవన్ సమావేశం
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు ప్రధాని మోడితో భేటి అయ్యే అవకాశం వుంది. పార్టీ నేత నాదెండ్ల మనోహర్తో కలిసి మోదీ సహా పలువురు బిజెపి ముఖ్య నాయకులను పవన్ కలుసుకుంటారని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఏపికి మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించనున్నట్టు సమాచారం. పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడు నడ్డాతోనూ పవన్ సమావేశం కానున్నారు. బిజెపి ఏపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి సమన్వయ కమిటీ సమావేశంలో జనసేనాని పాల్గొంటారని తెలిసింది. మరోవైపు, ఏపీకి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు పవన్ కల్యాణ్ను సంప్రదించాలని బిజెపి నిర్ణయించినట్టు తెలుస్తోంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/