జగన్ నువ్వు చెత్తలో చెత్త ముఖ్యమంత్రి అంటూ తాడేపల్లిగూడెం లో పవన్ కీలక వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండో దశ వారాహి యాత్ర సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. ఉభయ గోదావరి జిల్లాలో మొదటి దశ యాత్రను పూర్తి చేసిన పవన్.. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో రెండో దశ యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ యాత్ర కు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. ఈ క్రమంలో నేడు తాడేపల్లిగూడెం లో భారీ సభ నిర్వహించారు. స్థానిక ఎస్.వి.ఆర్ సర్కిల్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ..సీఎం జగన్ ఫై సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగన్ నువ్వు చెత్తలో చెత్త ముఖ్యమంత్రి .. ఇది చెత్త ప్రభుత్వం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకుల మీద టాక్స్ వేస్తావా..? జగన్ తీసుకునే లంచాన్ని ఎవరు పరివేక్షిస్తారు..? అంటూ వరుస ప్రశ్నలు వేశారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఒక్కరి డేటా ..హైదరాబాద్ లోని నానక్ రామగూడ లో ఉంచావు..అక్కడ ఎందుకు పెట్టావు..ఆ డేటా తో ఏంచేస్తావు..? అని ప్రశ్నించారు.

నీ వాలంటీర్ వ్యవస్థలో కొన్ని పుచ్చులు, కుళ్ళీపోయిన నీచ వ్యక్తులు ఉంటే నువ్వు ఏం చేస్తున్నావు. నువ్వు పరిశీలించుకో జగన్ అని ప్రశ్నించారు. మహిళా కమిషన్ ఉంది కదా.. మాట్లాడితే నాకు నోటీసులు పంపుతుంది కదా. మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే వాలంటీర్లపై పోలీసు స్టేషన్ దగ్గరకు వెళ్లండి. కలెక్టర్ దగ్గరకు వెళ్లండి. నేరం చేసే వాలంటీర్లకు భయం లేదు. మా జగన్ జైలుకు వెళ్లి వచ్చాడు. మేము వెళ్తాం అని తేలిగ్గా అంటున్నారు.

వాలంటీర్ల జీతాలు బూమ్ బూమ్ తక్కువ. ఆంధ్రగోల్డ్‌కి ఎక్కువ అంటూ మద్యం బాటిళ్లతో పవన్ పోల్చాడు. జనసేన జనవాణి ప్రారంభించడానికి వైస్సార్సీపీ వాలంటీర్ కారణం. ఒక అమ్మాయి ఆ మహిళా వాలంటీర్‌పై నాకు ఫిర్యాదు చేసినందుకు ఆమెను చంపేశారు. ఆడపిల్లల తాళిబొట్లు తెగిపోతే జగన్ అప్పుడు నవ్వుతాడు. సినీ నటుడు కృష్ణ చనిపోతే, పరామర్శకు వచ్చి అక్కడ నవ్వుతాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.