వారాహి యాత్రకు బ్రేక్..

పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్రకు బ్రేక్ పడింది. గత రెండు వారాలుగా రెస్ట్ లేకుండా పవన్ కళ్యాణ్ పర్యటిస్తుండడంతో అయన జ్వరం బారినపడ్డారు. మూడు రోజులుగా జ్వరం తోనే పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో జ్వరం ఎక్కువ కావడం తో డాక్టర్స్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు. దీంతో రెండు రోజుల పాటు ఆయన రెస్ట్ తీసుకోనున్నారు.

ప్రస్తుతం భీమవరం నిర్మలాదేవి ఫంక్షన్‌ హాల్‌లో పవన్‌ కల్యాణ్‌ విశ్రాంతి తీసుకుంటున్నారు. తిరిగి ఈ నెల 30న అంబేద్కర్ సెంటర్లో సభతో పవన్‌ వారాహి యాత్ర ప్రారంభం కానుంది. కాగా గత వారం రోజుల నుంచి వారాహి విజయ యాత్రలో బిజీబిజీగా ఉంటున్నారు పవన్‌. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాను చుట్టేసిన ఆయన ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. అవిశ్రాంతంగా సభలు, సమావేశాల్లో పాల్గొనడంతోనే పవన్‌ ఆరోగ్యం దెబ్బతినిందని తెలుస్తోంది.