మానవ మనుగడకు పంచభూతాలే ఆధారం
పర్యావరణ దినోత్సవం సందర్భంగా సందేశం

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రకృతి ప్రేమికులకు అభినందనలు తెలిపారు. ఈమేరకు పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు. పంచభూతాలను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ తమ పార్టీ మూల సిద్ధాంతమని చెప్పారు. మానవ జాతి సౌభాగ్యానికి పర్యావరణమే మూలమని, మానవ మనుగడకు పంచభూతాలే ఆధారమన్నారు. నింగి, నీరు, నేల, నిప్పు, గాలితో సమ్మిళితమైన పర్యావరణాన్ని పరిరక్షించుకున్నప్పుడే మానవజాతి శోభిల్లుతుందని చెప్పారు. మన ఆరోగ్యం పర్యావరణంతోనే ముడిపడి ఉందని చెప్పారు. చక్కటి పర్యావరణం ఉన్న చోట ఆసుపత్రుల అవసరం ఉండదని నిపుణులు పేర్కొంటున్నారని చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/