సింపుల్ గా ప్రారంభమైన పవన్ కొత్త చిత్రం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ పక్క వరుస సినిమాలు , మరోపక్క రాజకీయాల తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెట్స్ ఫై హరిహర వీరమల్లు, సుజిత్ డైరెక్షన్లో ఓ మూవీ , హరీష్ శంకర్ డైరెక్షన్లో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు ఉన్నాయి. వీటిలో ముందుగా హరిహర వీరమల్లు చిత్రాన్ని పూర్తి చేయనున్నాడు. ఇదిలా ఉండగానే మరో చిత్రాన్ని బుధువారం ప్రారంభించారు.

గత కొద్దీ రోజులుగా వినోద‌యా సితం చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడని , త్రివిక్రమ్ మాటలు , స్క్రీన్ ప్లే అందిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతూ వచ్చాయి. కానీ ఈ సినిమా సెట్స్ పైకి రాకపోయేసరికి అభిమానులు అయోమయంలో ఉన్నారు. కాగా ఆ వార్తలను నిజం చేస్తూ ఈరోజు బుధువారం చాల సింపుల్ గా ఈ చిత్రాన్ని ప్రారంభించారు. అందుకు సంబంధించిన ఫొటోలను రిలీజ్ చేశారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తున్నారు.

పవన్ క‌ల్యాణ్ .. సాయితేజ్ లకు సముద్రఖని స్క్రిప్ట్ చూపిస్తూ ఉండటం .. స్క్రిప్ట్ ను పవన్ పరిశీలిస్తూ ఉండటం .. ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకోవడం ఈ ఫొటోల్లో కనిపిస్తోంది. ఈ పిక్స్ తో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు. ఈ చిత్రైనికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.