ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్

సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అతి త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్నీ స్వయంగా మెగా బ్రదర్ నాగబాబు తెలిపారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలు , మరోవైపు రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఇక ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చి మరింత బిజీ కాబోతున్నాడు.

ప్రస్తుతం సినీ తారలతో పాటు రాజకీయ నేతలు సైతం సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజలకు , అభిమానులకు మరింత దగ్గర అవుతున్నారు. వారికీ సంబదించిన విషయాలు , రాజకీయ మీటింగ్ లకు సంధించిన విశేషాలు తెలియజేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సైతం ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఫాలోయర్స్ ను సంతోష పెట్టబోతున్నారు.

రీసెంట్ గా ఉభయ గోదావరి జిల్లాలో వారాహి యాత్ర చేపట్టిన పవన్..ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ సెట్ లో జాయిన్ అయ్యారు. గతంలో గబ్బర్ సింగ్ మూవీ ని తెరకెక్కించిన హరీష్ శంకర్ ఈ చిత్రానికి డైరెక్ట్ చేస్తుండగా..దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.