రెండు రాష్ట్రాల మందుబాబులకు తీపి కబురు తెలిపిన ప్రభుత్వాలు

రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మందు బాబులకు గుడ్ న్యూస్ తెలిపారు. ఈరోజు , రేపు అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్ షాప్స్ ఓపెన్ చేయబతాయని తెలిపారు. బార్లు క్లబ్బులు పర్మిషన్తో జరిగే ఈవెంట్లలో ఒంటిగంట వరకు మద్యం విక్రయాలకు పర్మిషన్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది ఎక్సైజ్ శాఖ. దీంతో మందుబాబులు పండుగ చేసుకుంటున్నారు.

డిసెంబర్ 31 అంటేనే మందుబాబులకు పెద్ద పండగా..ఏడాది అంత తాగుతూనే ఉంటారు..కానీ 31 అనగానే మాత్రం డోస్ పెంచేస్తారు..వచ్చే ఏడాది నుండి ఇక తాగొద్దని కొంతమంది..ఇయర్ పూర్తి అవుతుందని చెప్పి మరికొంతమంది మద్యం తాగుతారు..కేవలం మందు గిరాకే కాదు..చికెన్ , బిర్యానీ , కేక్స్ , రెస్టారెంట్స్ , పబ్స్ , హోటల్స్ ఇలా అన్ని కూడా జనాలతో కిటకిటలాడుతుంటాయి.