ట్విట్టర్ లో మరో మైలురాయిని దాటినా పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో మరో అరుదైన మైలురాయిని దాటాడు. ట్విట్టర్ అకౌంట్‌లో 5 మిలియన్ల (50 లక్షల మంది) ఫాలోవర్ల మార్క్‌ను పవన్ కళ్యాణ్ అందుకున్నాడు. దీంతో జనసేన కార్య కర్తలు , అభిమానులు తెగ సంబరాలు చేసుకుంటున్నారు. ‘Never ending response for the name PawanKalyan’అంటూ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇక ఏపీలోని రాజకీయ నాయకుల్లో పవన్ కళ్యాణ్ టాప్‌లో నిలువడం విశేషం. సీఎం జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు లను పవన్ వెనక్కు నెట్టేశాడు.

సీఎం జగన్‌కు 2.4 మిలియన్ ఫాలోవర్లు ఉంటే.. చంద్రబాబుకు 4.9 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 1 మిలియన్‌కు దగ్గరలో ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం 5 మిలియన్ల ఫాలోవర్లతో టాప్‌లో కొనసాగుతుండగా.. చంద్రబాబు కూడా 5 మిలియన్లకు దగ్గరలో రెండో ప్లేస్‌లో ఉండగా.. ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్ 2.4 మిలియన్ ఫాలోవర్లతో మూడో స్థానంలో ఉన్నారు.

ఇక ఏపీలో రాజకీయాల విషయానికి వస్తే..ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే రాజకీయ వేడి నడుస్తుంది. అన్ని పార్టీల నేతలంతా కూడా ప్రజలను కలిసేందుకు యాత్రలు మొదలుపెట్టారు. అక్టోబర్ 05 నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర చేపట్టబోతున్నారు.