ఇక ప్రతి రోజు 3 సభలతో పవన్ బిజీ బిజీ ..
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో జనసేన అధినేత పూర్తిగా ప్రజల్లో ఉండేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబు వరుస సభలతో బిజీ గా ఉండడం..మరోపక్క వైసీపీ తమ అభ్యర్థులను ప్రకటిస్తూ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టడం తో..పవన్ సైతం ఇక బిజీ అయ్యేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పవన్ పర్యటనలకు సంబదించిన వివరాలు తెలిపారు.
మంగళగిరిలోని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో పార్టీ జోనల్ కమిటీల సభ్యులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. మనోహర్ మాట్లాడుతూ.. ‘పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించడంతో పాటు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో బహిరంగసభలు ఏర్పాటుచేసేలా ప్రణాళిక రూపొందించాం. రోజుకు మూడు సభల్లో పవన్ పాల్గొంటారు. ఈ సభలను విజయవంతం చేసే బాధ్యతను జోనల్ కమిటీలు తీసుకోవాలి” అని సూచించారు. మరో రెండు నెలలు శక్తివంచన లేకుండా కష్టపడితే విజయం తథ్యమని కమిటీలకు దిశానిర్దేశం చేశారు.